హైదరాబాద్‌లోని హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు

20 బృందాలుగా విడిపోయిన అధికారులు
సంస్థ డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లపైనా దాడులు
కొనసాగుతున్న తనిఖీలు
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మస్యూటికల్ కంపెనీ హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఆదాయ పన్నుశాఖ దాడులకు దిగింది. కార్పొరేట్ కార్యాలయంతోపాటు ఉత్పత్తి కేంద్రాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, అదే సమయంలో సంస్థ డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 20 బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఒకేసారి దాడులకు దిగడం సంచలనమైంది.

Hetero Drugs
Hyderabad
IT Raids

More Telugu News